కబడ్డీ కోర్టు కోసం మట్టి పోయించిన ఉపసర్పంచ్ రాజు శర్మ అంజనేయులు టీవీ , 21 జనవరి , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మూడవ వార్డులో కబడ్డీ కోర్టు ఏర్పాటు కోసం గంగాధర క్షేత్ర వ్యవస్థాపకులు దామోదర శర్మ జ్ఞాపకార్థం, ఉప సర్పంచ్ మూగు నాగరాజ్ శర్మ మట్టి కుప్పలను పోయించారు. మూడవ వార్డులోని యువకులు కబడ్డీ కోర్టును ఏర్పాటు చేయాలని రాజు శర్మకు విన్నవించగా, వెంటనే ఆయన తన సొంత ఖర్చులతో ట్రాక్టర్లతో మట్టి కుప్పలను పోయించారు. ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు సభ్యులు శ్రీమతి మామిడి సుశీల, మామిడి రాజు, అంగన్వాడి టీచర్ బైరి అరుణ, నార్ల దినేష్, మామిడి అనిల్, తదితరులు పాల్గొన్నారు.